Webdunia - Bharat's app for daily news and videos

Install App

16వ బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి.. శిశువు కూడా..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (11:28 IST)
16వ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక నవజాత శిశువు కూడా చనిపోయింది. మధ్యప్రదేశ్ జిల్లాలోని పదాజిర్ గ్రామానికి చెందిన సుఖ్రానీ అహిర్‌వార్ అనే మహిళ శనివారం ఇంట్లో పసికందును ప్రసవించిందని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) కల్లో బాయి విశ్వకర్మ తెలిపారు.
 
కానీ ప్రసవం సందర్భంగా మహిళతో పాటు నవజాత శిశువు పరిస్థితి క్లిష్టంగా మారింది. తర్వాత వారిని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు, అక్కడ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 
 
ఇకపోతే.. అహిర్వర్ ఇంతకుముందు 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వారిలో ఏడుగురిని కుటుంబం కోల్పోయింది. తాజాగా 16వ బిడ్డకు జన్మనిస్తూ.. ఆమెతో పాటు శిశువు కూడా కన్నుమూసింది. ఈ సంఘటనను జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments